Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం చేసిన భారత్ హాకీ జట్టు

Webdunia
శనివారం, 24 జులై 2021 (10:26 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా విశ్వ క్రీడలు (ఒలింపిక్స్ పోటీలు) శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా, శనివారం జరిగిన ప్రారంభపోటీల్లో భారత పురుషులు హాకీ జట్టు శుభారంభం చేసింది. 
 
పూల్-ఏలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-2 తేడాతో గెలిచింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, రూపిందర్ పాల్ సింగ్ ఒక గోల్ చేశాడు. ఆట చివరి నిమిషాల్లో కివీస్ దూకుడు ప్రదర్శించింది. దాంతో ప్రత్యర్థి జట్టుకు వరుసగా పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. 
 
అయితే, సీనియర్ గోల్‌కీపర్‌ శ్రీజిష్ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. శ్రీజిష్ తన అద్భుత కీపింగ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టుకు గోల్స్ రాకుండా గోడల నిలబడి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 
 
ఇక చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ విజయంతో బోణీ కొట్టడం విశేషం. మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments