Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం చేసిన భారత్ హాకీ జట్టు

Webdunia
శనివారం, 24 జులై 2021 (10:26 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా విశ్వ క్రీడలు (ఒలింపిక్స్ పోటీలు) శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా, శనివారం జరిగిన ప్రారంభపోటీల్లో భారత పురుషులు హాకీ జట్టు శుభారంభం చేసింది. 
 
పూల్-ఏలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-2 తేడాతో గెలిచింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, రూపిందర్ పాల్ సింగ్ ఒక గోల్ చేశాడు. ఆట చివరి నిమిషాల్లో కివీస్ దూకుడు ప్రదర్శించింది. దాంతో ప్రత్యర్థి జట్టుకు వరుసగా పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. 
 
అయితే, సీనియర్ గోల్‌కీపర్‌ శ్రీజిష్ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. శ్రీజిష్ తన అద్భుత కీపింగ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టుకు గోల్స్ రాకుండా గోడల నిలబడి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 
 
ఇక చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ విజయంతో బోణీ కొట్టడం విశేషం. మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments