టోక్యో ఒలింపిక్స్‌లో ముగిసిన మనికా పోరాటం

Webdunia
సోమవారం, 26 జులై 2021 (14:54 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భాగంగా, టేబుల్ టెన్నిస్ విభాగంలో రెండు రౌండ్లు దాటి సంచ‌ల‌నం సృష్టించిన భారత క్రీడాకారిణి మ‌నికా బాత్రా పోరాటం మూడో రౌండ్‌లో ముగిసింది. ఆస్ట్రియా క్రీడాకారిణి సోఫియా పోల్క‌నోవా చేతిలో ఆమె 0-4తో దారుణంగా ఓడిపోయింది. 
 
ప్ర‌త్య‌ర్థి దూకుడైన ఆట ముందు మ‌నికా నిల‌వ‌లేక‌పోయింది. పోల్క‌నోవా 11-8, 11-2, 11-5, 11-7 తేడాతో సునాయాసంగా గెలిచింది. 30 నిమిషాలలోపే ఈ మ్యాచ్ ముగియ‌డం విశేషం. 
 
ఇదిలావుంటే, ప్రపంచ ఛాంపియన్ మెక్ మేరీ కోమ్ 51 కిలోల విభాగం మహిళల బాక్సింగులో ఆదివారం అరగొట్టారు. విజయంతో టోక్యో ఒలింపిక్స్‌ను ప్రారంభించింది. ఆదివారం డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన హెర్నాండెజ్ గ్రేసియా మిగ్వెలినాను ఆమె.. 4–1 తేడాతో మట్టి కరిపించింది. 
 
ఒక్క రెండో రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి.. రౌండ్ ఆఫ్ 16ను గెలిచి ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రి క్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ వాలెన్సియా విక్టోరియాను మేరీకోమ్ ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ జులై 29న జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

తర్వాతి కథనం
Show comments