Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్.. ఛెత్రి అదుర్స్.. భారత్‌కే కప్

ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్‌ భారత్‌కు సొంతమైంది. భారత్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తన సత్తా ఏంటూ నిరూపించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో కెన్యాపై 2-0తో విజయం సాధించిన భారత జట్టు కప్ప

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (10:07 IST)
ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్‌ భారత్‌కు సొంతమైంది. భారత్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తన సత్తా ఏంటూ నిరూపించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో కెన్యాపై 2-0తో విజయం సాధించిన భారత జట్టు కప్పును సొంతం చేసుకుంది. ముంబై ఫుట్‌బాల్ ఎరీనాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం భారత్ మెరుగైన ఆటతీరును కనబరచింది. 
 
ఇకపోతే. కెప్టెన్ సునీల్ ఛెత్రి కెరీర్‌లో 102వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన గోల్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. మరోవైపు ప్రత్యర్థి కెన్యా జట్టుపై ఒత్తిడి పెంచడంలో భారత ఆటగాళ్లు సఫలం అయ్యారు. కెన్యా గోల్‌ ప్రయత్నాలకు గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు గండికొట్టాడు. డిఫెండర్లు సైతం చక్కని ప్రతిభ కనబరిచి విజయంలో కీలకపాత్ర పోషించారు. 
 
అలాగే ఈ టోర్నీలో తొలి నుంచి భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ఛెత్రి అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. తద్వారా మొత్తం 64గోల్స్ సాధించి అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ సరసన చేరాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments