Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా సైనా

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (16:54 IST)
ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ నిలిచింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సైనా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్‌తో టైటిల్ పోరులో సైనా బరిలోకి దిగింది. 
 
కానీ మోకాలి గాయం కారణంగా మారీన్ మధ్యలోనే తప్పుకుంది. దీంతో మ్యాచ్ ముగియకుండానే సైనా టైటిల్ కైవసం చేసుకుంది. మ్యాచ్ మొదట్లో సైనా అనవసర తప్పిదం చేయడంతో కరోలినా మారిన్ తొలి పాయింట్ సాధించింది. దూకుడుగా ఆడిన మారిన్ తర్వాత 0-3తో ఆధిక్యం సాధించింది. కరోలినా తప్పిదంతో సైనాకు తొలి పాయింట్ దక్కింది. 
 
సైనా 1-4తో వెనకబడి ఉన్న సమయంలో మారిన్ కాలుకు గాయమైంది. తీవ్రమైన నొప్పితో కాసేపు ఇబ్బందిపడింది. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత మళ్లీ రాకెట్ అందుకొని కోర్టులో అడుగుపెట్టింది. కానీ గాయం తీవ్రత ఎక్కువగా వుండటంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగడంతో సైనా విజేతగా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments