Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేరీకోమ్ అదుర్స్.. పోలాండ్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం

భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ మరోసారి తన సత్తా ఏంటో చాటుకుంది. పోలాండ్‌లో జరుగుతున్న సిలిసియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మేరీకోమ్ తన బలం ఏంటో నిరూపించుకుంది. 48 కేజీల విభాగంలో కజిఖిస్థాన్‌క

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (15:25 IST)
భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ మరోసారి తన సత్తా ఏంటో చాటుకుంది. పోలాండ్‌లో జరుగుతున్న సిలిసియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మేరీకోమ్ తన బలం ఏంటో నిరూపించుకుంది. 48 కేజీల విభాగంలో కజిఖిస్థాన్‌కు చెందిన ఐగెరిం కసనవేయాను 5-0 తేడాతో చిత్తు చేసింది. తద్వారా స్వర్ణ పతకం సాధించింది. ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన కోమ్‌ ఈ ఏడాదిలో మూడో బంగారాన్ని సాధించుకుంది. 
 
అలాగే సిలేసియన్‌ ఓపెన్‌ పోలిష్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత అమ్మాయి జ్యోతి గులియా పసిడి పంచ్‌ విసిరింది. యూత్‌ కేటగిరి ఫైనల్లో జ్యోతి.. స్థానిక బాక్సర్‌ తాతియానాను చిత్తుచేసి స్వర్ణం సాధించింది. ఇక, భారత సీనియర్‌ మహిళా బాక్సర్‌ సరితా దేవి (60 కి) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీస్‌లో 0-5తో కరీనా (కజకిస్థాన్‌) చేతిలో సరిత ఓడింది. 
 
మరో ఇద్దరు భారత బాక్సర్లు లవ్లీనా బొర్గైన్‌ (69 కి), పూజా రాణి (81 కి) సెమీ‌స్‌లో ఓడి కాంస్యాలు అందుకున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత జూనియర్లు ఓవరాల్‌గా 13 పతకాలు (6 స్వర్ణాలు, 6 రజతాలు, ఓ కాంస్యం) కొల్లగొట్టారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments