Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2022-ఢిల్లీకి కష్టాలు.. నలుగురు క్రికెటర్లకు కరోనా

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (15:44 IST)
ఐపీఎల్ 2022లో కరోనా కలకలం రేపుతోంది. నలుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఢిల్లీ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు.  ఇప్పటికే ఢిల్లీ ఫిజియో ప్యాట్రిక్‌ ఫార్‌హర్ట్‌ పాజిటివ్‌గా తేలడంతో ఈ సీజన్‌లో తొలి కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ కూడా సోమవారం ఆసుపత్రి పాలయ్యారు. ప్యాట్రిక్‌, మార్ష్‌ కాకుండా జట్టు డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి, మసాజర్‌ కూడా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. మార్ష్‌ కాకుండా మిగతా ఆటగాళ్లందరికీ రెండు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో బుధవారం పంజాబ్‌తో ఢిల్లీ మ్యాచ్‌ను యధావిధిగా నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. 
 
''మార్ష్‌కు తొలి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. కానీ రెండో పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. మిగతా ఆటగాళ్లందరూ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా తేలారు. ఢిల్లీ -పంజాబ్‌ మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు'' అని ఓ సీనియర్‌ బిసిసిఐ అధికారి తెలిపారు.
 
వివిధ జట్లలోని ఆటగాళ్లకు కరోనా సోకడంతో గతేడాది భారత్‌లో టోర్నీని వాయిదా వేసి.. అనంతరం సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్యలో యుఎఇలో నిర్వహించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments