Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ సిరీస్ టోర్నీలో పీవీ సింధు ఓటమి

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (17:01 IST)
ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో సింధుపై 15-21, 16-21 తేడాతో నాలుగో సీడ్‌, జపాన్‌ షట్లర్‌ అకానె యమగూచి విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన యమగూచి వరుస గేముల్లో ఆధిపత్యం చెలాయించి సింధును చిత్తుచేసింది. రెండు గేముల్లో ఆఖర్లో పాయింట్లు సాధించిన యమగూచి సింధుపై ఒత్తిడి పెంచి ఆధిక్యం సాధించింది. 
 
కాగా, ఈ సీజన్‌లో సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో సింధు ప్రవేశించడం ఇదే తొలిసారి. 2019లో ఓ అంతర్జాతీయ టోర్నీలో తొలి టైటిల్‌ సాధించాలనుకున్న సింధు కల నెరవేరలేదు. 
 
ముఖ్యంగా, సెమీస్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ చెన్‌ యుఫీని వరుస గేముల్లో చిత్తు చేసిన సింధు.. ఫైనల్లో ఈజీగానే గెలుస్తుందని అనుకున్నారంతా!. ఆద్యంతం ఏక‌ప‌క్షంగా సాగిన తుదిపోరులో జ‌పాన్ అమ్మాయి టైటిల్ నెగ్గింది. దీంతో ఆమె రన్నరప్‍గా నిలవాల్సివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments