Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్చరీ నాలుగో వరల్డ్ కప్- రజతం సాధించిన భారత మహిళల జట్టు

ఆర్చర్ జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన జ్యోతి సురేఖ రెండు పతకాలను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్-4 టోర్నీలో సురేఖ, త్ర

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (14:56 IST)
ఆర్చర్ జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన జ్యోతి సురేఖ రెండు పతకాలను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్-4 టోర్నీలో సురేఖ, త్రిషా దేబ్, ముస్కాన్‌‌లతో కూడిన భారత మహిళల జట్టు పాయింట్‌ తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది.


ఫైనల్లో భారత్‌ 228-229తో సోఫీ డోడ్‌మోంట్, అమెలీ సాన్‌ సెనోట్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్‌ జట్టు చేతిలో పరాజయం పాలై రజత పతకాన్ని దక్కించుకుంది.
 
నాలుగు రౌండ్‌‌లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్‌‌లో ఒక్కో జట్టు ఆరేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్‌‌లో భారత్‌ 59-57తో పైచేయి సాధించగా… రెండో రౌండ్‌లో 57-59తో, మూడో రౌండ్‌లో 53-58తో వెనుకబడిపోయింది.

చివరిదైన నాలుగో రౌండ్‌లో భారత్‌ 59-55తో ఆధిపత్యం చలాయించినా ఓవరాల్‌గా ప్రత్యర్థి స్కోరుకు ఒక పాయింట్‌ దూరంలో ఉండిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments