ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం గెలిస్తే రూ.7 కోట్లు ఇస్తాం : సీఎం చంద్రబాబు

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (19:09 IST)
ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం గెలిచే క్రీడాకారుడికి రూ.7 కోట్ల నగదు బహుమతి ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సోమవారం రాష్ట్ర కొత్త క్రీడా విధానంపై ఆయన సమీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రీడా పోటీల్లో పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందన్నారు. ఒలింపిక్స్ బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటివరకు రూ.75 లక్షలు ఇస్తుండగా, ఈ మొత్తాన్ని ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
అలాగే, రజత పతకం సాధించిన వారికి రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షల స్థానంలో రూ.3 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. వరల్డ్ చాంపియన్ షిప్, వరల్డ్ కప్పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధిస్తే రూ.10 లక్షలు, రజతం విజేతలకు రూ.5 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.3 లక్షలు చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందజేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

తర్వాతి కథనం
Show comments