Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో పారాలింపిక్స్‌‌లో భవీనాబెన్‌ పటేల్‌ అదుర్స్.. పతకం ఖాయం

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (20:00 IST)
bhavina patel
టోక్యో పారాలింపిక్స్‌‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగంలో సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టి భారత్‌కు పతకం ఖాయం చేసింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. 
 
టోక్యో పారాలింపిక్స్‌లో తొలి రోజు నిరాశపరిచిన భారత టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవీనాబెన్‌ పటేల్‌ రెండో రోజు ఆశాజనక ఫలితం సాధించింది. 
 
గ్రూపు-ఏ మహిళల క్లాస్‌ 4 విభాగంలో బరిలోకి దిగిన ప్యాడ్లర్‌ భవీనా.. గురువారం జరిగిన హోరాహోరి మ్యాచ్‌‌లో మేగన్‌ షక్లెటన్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)పై 3-1 (11-7, 9-11, 17-15, 13-11)తో విజయం సాధించింది. 
 
డూ ఆర్‌ డై మ్యాచ్‌ అయిన పోటీలో ఆత్మవిశ్వాసంతో ఆడిన భవీనా.. ప్రపంచ ర్యాంకింగుల్లో తనకంటే మూడు ర్యాంక్‌లు ముందున్న మేగన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 
 
మరోవైపు మహిళల సింగిల్స్‌ క్లాస్‌-3లో సోనాల్‌బెన్‌ 1-3తో లీ మి గ్యూ(దక్షిణకొరియా) చేతిలో ఓడి నిష్క్రమించింది. దీంతో మెగాటోర్నీలో ఆమె పోరాటం ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Asaduddin Owaisi: కొంచెం ఆత్మపరిశీలన చేసుకోండి.. మూర్ఖత్వమే కదా...

విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)

Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్‌కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments