టోక్యో పారాలింపిక్స్‌‌లో భవీనాబెన్‌ పటేల్‌ అదుర్స్.. పతకం ఖాయం

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (20:00 IST)
bhavina patel
టోక్యో పారాలింపిక్స్‌‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగంలో సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టి భారత్‌కు పతకం ఖాయం చేసింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. 
 
టోక్యో పారాలింపిక్స్‌లో తొలి రోజు నిరాశపరిచిన భారత టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవీనాబెన్‌ పటేల్‌ రెండో రోజు ఆశాజనక ఫలితం సాధించింది. 
 
గ్రూపు-ఏ మహిళల క్లాస్‌ 4 విభాగంలో బరిలోకి దిగిన ప్యాడ్లర్‌ భవీనా.. గురువారం జరిగిన హోరాహోరి మ్యాచ్‌‌లో మేగన్‌ షక్లెటన్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)పై 3-1 (11-7, 9-11, 17-15, 13-11)తో విజయం సాధించింది. 
 
డూ ఆర్‌ డై మ్యాచ్‌ అయిన పోటీలో ఆత్మవిశ్వాసంతో ఆడిన భవీనా.. ప్రపంచ ర్యాంకింగుల్లో తనకంటే మూడు ర్యాంక్‌లు ముందున్న మేగన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 
 
మరోవైపు మహిళల సింగిల్స్‌ క్లాస్‌-3లో సోనాల్‌బెన్‌ 1-3తో లీ మి గ్యూ(దక్షిణకొరియా) చేతిలో ఓడి నిష్క్రమించింది. దీంతో మెగాటోర్నీలో ఆమె పోరాటం ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments