Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోరం.. స్టేడియంలో తొక్కిసలాట - 127 మంది మృతి

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (08:19 IST)
ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్సులోని మలాంగ్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది చనిపోయారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు.
 
ఓడిన జట్టుకు చెందిన అభిమానులు మైదానంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లారు. పైగా, ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. 
 
మలాంగ్‌లో జరిగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులు మైదానంలో చొచ్చుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్  చేస్తున్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో పెర్సెబయి జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో మరో వారం రోజుల పాటు ప్రముఖ లీగ్ బీఆర్ఐ లీగ్ 1 టోర్నీ మ్యాచ్‌లను నిషేధించింది. 
 
మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా విచారణకు ఆదేశించింది. ఇదిలావుంటే, ఇండోనేషియాలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments