Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోరం.. స్టేడియంలో తొక్కిసలాట - 127 మంది మృతి

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (08:19 IST)
ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్సులోని మలాంగ్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది చనిపోయారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు.
 
ఓడిన జట్టుకు చెందిన అభిమానులు మైదానంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లారు. పైగా, ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. 
 
మలాంగ్‌లో జరిగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులు మైదానంలో చొచ్చుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్  చేస్తున్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో పెర్సెబయి జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో మరో వారం రోజుల పాటు ప్రముఖ లీగ్ బీఆర్ఐ లీగ్ 1 టోర్నీ మ్యాచ్‌లను నిషేధించింది. 
 
మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా విచారణకు ఆదేశించింది. ఇదిలావుంటే, ఇండోనేషియాలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments