Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో బ్లాక్ మండే.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ బంద్

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (10:59 IST)
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న ప్రచారంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయారు. ఫలితంగా సెన్సెక్స్ సూచీ ఏకంగా 2 వేల పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ కూడా 8100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పతనం కొనసాగే అవకాశం ఉండటంతో బాంబే స్టాక్ మార్కెట్‌లో ట్రెడింగ్ నిలిపివేశారు. 
 
ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టిముట్టేసింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ కరోనా వల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌న్న ప్రచారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్లు బోరుమ‌న్నాయి. అమెరికా మార్కెట్లు కూడా డీలాప‌డ‌డంతో.. సోమవారం ఉద‌యం సెక్సెక్స్‌, నిఫ్టీలు ట్రేడింగ్‌లో ప‌త‌నం చూపించాయి.
 
సెన్సెక్స్ భారీగా ప‌త‌నం కావ‌డంతో.. సుమారు 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపేశారు. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ కూడా త‌గ్గింది. యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, మారుతీ సుజుకీ ఇండియా, ఐటీసీ, హీరో మోటో కార్ప్ లాంటి సంస్థ‌లు భారీగా న‌ష్ట‌పోయాయి. సోమవారం ఉద‌యం దాదాపు 10 శాతం మేర‌కు మార్కెట్లు డౌన్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments