Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకలా అర్థమైందా? ఆ ఫ్లెక్సీలో ఆ ఫోటో ఎవరదండీ...

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (17:56 IST)
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కారకుడు. ఇది అందరికీ తెలిసిందే. పట్టాభిరాం ఇంటిపై దాడికి ప్రయత్నించారు వైసిపి కార్యకర్తలు. పట్టాభిరాం ఎప్పుడూ టివీల్లో కనిపిస్తూ ఉంటాడు. 

 
అలాంటి వ్యక్తి గురించి ఆందోళన చేయాల్సిన వైసిపి కార్యకర్తలు మరొక పట్టాభి ఫోటోతో ప్రత్యక్షమయ్యారు. ఇదంతా ఎక్కడో కాదు తూర్పు గోదావరిజిల్లా పి.గన్నవరంలో జరిగింది. గన్నవరం తహశీల్ధార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

 
ఆ ఫ్లెక్సీలో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంకు బదులు ఆంధ్రాబ్యాంక్ వ్యవస్ధాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరును పెట్టారు. సిఎంపై దుర్భాషలాడిన కొమ్మారెడ్డి పట్టాభిరాం పేరుకు బదులు వైసిపి నాయకులు వేరే వ్యక్తి ఫోటో పెట్టడం విమర్సలకు తావిస్తోంది. 

 
ఫ్లెక్సీ పట్టుకుని మరీ నేతలు నిరసనకు దిగడం కొసమెరుపు. చాలాసేపటి వరకు ఆ ఫోటో ఎవరిదో గుర్తుపట్టలేకపోయారు. అయితే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు పట్టాభి ఇతను కాదని చెప్పడంతో ఫ్లెక్సీని పక్కకు తీసుకెళ్ళి పడేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments