Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌరీగుట్టపై శ్రీ గౌతమేశ్వరుడు... ఆలయ విశిష్టతలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గుత్తి గ్రామములో వెలసిన స్వయంభువు శ్రీ గౌతమేశ్వరస్వామిగా ప్రసిద్ధి. గుత్తి రైల్వేస్టేషన్‌కు ఈశాన్య భాగాన ఒక పవిత్రమైన కొండగుట్ట కలదు. చుట్టూ పచ్చని పొలాలు, పచ్చని చెట్ల మధ్య ఒకే గుట్టపై ఒకే ప్రాంగణంలో ఎనిమిది దేవాల

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (13:41 IST)
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గుత్తి గ్రామములో వెలసిన స్వయంభువు శ్రీ గౌతమేశ్వరస్వామిగా ప్రసిద్ధి. గుత్తి రైల్వేస్టేషన్‌కు ఈశాన్య భాగాన ఒక పవిత్రమైన కొండగుట్ట కలదు. చుట్టూ పచ్చని పొలాలు, పచ్చని చెట్ల మధ్య ఒకే గుట్టపై ఒకే ప్రాంగణంలో ఎనిమిది దేవాలయములతో చూసేందుకు దివ్యక్షేత్రంలా కనిపించే ఆ పవిత్రగుట్టకు గౌరీగుట్ట అని పేరు. 
 
ఈ గుట్టలోని ఒక బిలములో శివుడు స్వయంభువుగా ఉద్భవించిన లింగము వుంది. శ్రీ గౌతమ మహర్షుల తపస్సుకు మెచ్చి శివుడు స్వయంగా అవతరించిన లింగరూపుడు కనుక ఈ లింగానికి గౌతమేశ్వర లింగం అని పేరు. శ్రీ గౌతమేశ్వరుడుగా వెలసిన ఈ గౌతమేశ్వర లింగము తొలుత మనుషులకు కనిపించేది కాదు. కాలక్రమేణా పెరుగుతూ నేటికి ఒక అడుగు ఎత్తు పెరిగింది. శ్రీ గౌతమేశ్వర లింగమునకు వెనుక గోడవలే వుండే రాతిబండకు క్రింది భాగమున చిన్న రంధ్రము ఉంది. 
 
ఈ రంధ్రము ద్వారా, నీటి చెమ్మ వచ్చి శ్రీ గౌతమేశ్వర లింగమునకు తాకుతూ వుంటుంది. ఇక్కడికి రామదాసు అనే సాధువు వచ్చి కొండ బిలములలో నివశిస్తూ భక్తుల సహకారంతో ఎనిమిది ఆలయాలను నిర్మించి స్వర్గస్తులయ్యారి. ఈ బిలములో వున్న సొరంగ మార్గము నుండి నేటికీ ఒక పెద్ద పాము వచ్చి స్వామి వారిని సేవించి పోతూ వుండటం అద్భుతం. శ్రీ రామదాసు భక్తుల సహకారంతో గౌతమేశ్వరుడున్న బిలములోనే అభయ ముద్రతో పార్వతీ దేవి అతి సుందర విగ్రహమును ప్రతిష్టించారు. గౌతమేశ్వరుడున్న బిలమునకు కొద్దిదూరములో కుడివైపున ఇద్దరు పతులతో శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి  ఆలయము, మహాగణపతి ఆలయము, కాళింగ మర్ధనుడి ఆలయము, శ్రీ గౌతమేశ్వరుడి బిలమునకు ఎడమ ప్రక్కగా బిలము నందు శ్రీ వీరభధ్రస్వామి విగ్రహము, శ్రీ భూదేవి ముఖరూపు విగ్రహము ప్రతిష్టంచియున్నారు.
 
శ్రీ గౌతమేశ్వరుని ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామి దేవాలయము, నవగ్రహముల ఆలయము ప్రతిష్టంచియున్నారు. ఈ ఆలయములు అన్నీ ఒకే గుట్టపై ఉన్నాయి. ఈ ఆలయము అన్నింటికి కలిపి ఒకే ప్రహరీగోడ నిర్మించారు. ఈ గుట్ట క్రింది భాగాన శ్రీ షిరిడి బాబా వారి ఆలయము కట్టించియున్నారు. శ్రీ రామదాసుగారి మరణానంతరము స్ధానికులు వీరిని ఇచ్చటనే సమాధి చేశారు. కార్తీక మాసములో స్వామి వారికి భక్తాదులచే అభిషేకము, సోమవారము సామూహిక రుద్రాభిషేకము జరుపుచున్నారు. జ్వాలాతోరణ మహాత్సవము నాడు భక్తులతో దేవాలయము కిటకిటలాడుతుంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments