Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప యాత్రకు కేరళ సర్కారు సమ్మతం!!

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (21:03 IST)
ప్రతి యేడాది జరిగే శబరిమల అయ్యప్ప యాత్రకు కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా నిబంధలకు లోబడే ఈ యాత్ర కొనసాగుతుందని కేరళ రాష్ట్ర దేవాదాయ మంత్రిత్వ శాఖ సురేంద్రన్ వెల్లడించారు. 
 
ప్రతి యేడాది శబరిమల యాత్ర నవంబరు నెలలో ప్రారంభమవుతుంది. ఈ యేడాది నవంబరు 16వ తేదీన ప్రారంభంకానుంది. అయితే, ఈ యాత్రకు వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే ధృవపత్రాన్ని చూపించాల్సివుంటుంది. 
 
ఐసీఎమ్మార్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ల‌లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని కేర‌ళ ఆరోగ్య‌మంత్రి చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిట‌ళ్ల‌లో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. 
 
పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. అలాగే విపత్తు నిర్వహణల్లో భాగంగా హెలిక్యాప్ట‌ర్‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు.
 
కాగా, ప్రతి యేడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు అనుమతిచ్చినప్పటికీ.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ యాత్రను మధ్యలోనే నిలిపివేసిన విషయంతెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

తర్వాతి కథనం
Show comments