Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప యాత్రకు కేరళ సర్కారు సమ్మతం!!

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (21:03 IST)
ప్రతి యేడాది జరిగే శబరిమల అయ్యప్ప యాత్రకు కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా నిబంధలకు లోబడే ఈ యాత్ర కొనసాగుతుందని కేరళ రాష్ట్ర దేవాదాయ మంత్రిత్వ శాఖ సురేంద్రన్ వెల్లడించారు. 
 
ప్రతి యేడాది శబరిమల యాత్ర నవంబరు నెలలో ప్రారంభమవుతుంది. ఈ యేడాది నవంబరు 16వ తేదీన ప్రారంభంకానుంది. అయితే, ఈ యాత్రకు వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే ధృవపత్రాన్ని చూపించాల్సివుంటుంది. 
 
ఐసీఎమ్మార్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ల‌లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని కేర‌ళ ఆరోగ్య‌మంత్రి చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిట‌ళ్ల‌లో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. 
 
పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. అలాగే విపత్తు నిర్వహణల్లో భాగంగా హెలిక్యాప్ట‌ర్‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు.
 
కాగా, ప్రతి యేడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు అనుమతిచ్చినప్పటికీ.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ యాత్రను మధ్యలోనే నిలిపివేసిన విషయంతెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments