Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా ఒక లడ్డూ.. అదనపు లడ్డు ధర రూ.50

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (16:30 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉచిత లడ్డూ విషయంలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం జనవరి 19వ తేదీ ఆదివారం రాత్రి నుంచి అమల్లోకిరానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాయితీ లడ్డూ విధానానికి స్వస్తి చెప్పనుంది. 
 
లడ్డూ ప్రసాదం పంపిణీలో ఆదివారం అర్థరాత్రి నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రతి భక్తులడికీ ఉచితంగా ఒక్క లడ్డూ మాత్రమే అందిస్తామని తెలిపారు. ప్రతీ అదనపు లడ్డూ కోసం రూ.50 చొప్పున చెల్లించాలని వెల్లడించారు. ఇందుకోసం 12 అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్‌, ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులకు కొత్త విధానం అమలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

Telangana: కామారెడ్డిలో భారీ వరదలు- నీటిలో చిక్కుకున్న ఆరుగురు.. కారు కొట్టుకుపోయింది.. (videos)

అవన్నీ తడిసిన టపాసుల్లాంటివి.. ఎప్పుడూ వెలగవు.. కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు

అమ్మ కుటుంబానికి అవమానం తెచ్చింది.. చంపేద్దాం.. తండ్రీ కూతుళ్ల దారుణం

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

తర్వాతి కథనం
Show comments