కొత్త వివాదంలో తితిదే - లవుడు ఒక్కడే.. కుశడు కాదా? (video)

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. తితిదే ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే సప్తగిరి మాసపత్రికలో భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం ప్రచురితమైంది. సీతారాములకు ఒక్కరే కుమారుడని పేర్కొంది. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. 
 
ఈ వార్త చూడగానే బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆగ్రహం వ్యక్త చేస్తూ, ఆందోళనకు దిగారు. తితిదే వంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై భక్తులు కూడా తితిదేపై మండిపడుతోంది.
 
ఇటీవలే తితిదే ఓ వివాదం నుంచి బయటపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి నిరర్ధక ఆస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో తితిదే తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

పెళ్లికి అడ్డు వస్తున్నాడనీ ప్రియుడుని హత్య చేసిన టీవీ నటి

నేపాల్ సరిహద్దుల్లో మనీ డెన్ కీపర్ ప్రణయ్ ప్రకాశ్ అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది

01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

తర్వాతి కథనం
Show comments