Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త వివాదంలో తితిదే - లవుడు ఒక్కడే.. కుశడు కాదా? (video)

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. తితిదే ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే సప్తగిరి మాసపత్రికలో భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం ప్రచురితమైంది. సీతారాములకు ఒక్కరే కుమారుడని పేర్కొంది. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. 
 
ఈ వార్త చూడగానే బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆగ్రహం వ్యక్త చేస్తూ, ఆందోళనకు దిగారు. తితిదే వంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై భక్తులు కూడా తితిదేపై మండిపడుతోంది.
 
ఇటీవలే తితిదే ఓ వివాదం నుంచి బయటపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి నిరర్ధక ఆస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో తితిదే తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments