Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టానుసారంగా తిరుమల కొండెక్కుతామంటే కుదరదు : తితిదే

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (08:58 IST)
కలియుగ వైకుంఠంగా భావించే ఏడు కొండలు ఎక్కాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో షాక్ ఇచ్చింది. ఇష్టమొచ్చినపుడు కొండెక్కాలనుకుంటే ఇకపై వీలుపడదు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. 
 
కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో సాధారణ భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం టైం స్లాట్‌ టికెట్లు ఉన్నప్పటికీ.. భక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కొండెక్కేద్దామంటే  వీలుపడదు. టైం స్లాట్‌లో పేర్కొన్న సమయానికి కొన్ని గంటల ముందు మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. 
 
వాస్తవానికి ప్రస్తుతం తిరుపతిలోని రైల్వే స్టేషన్‌ ముందున్న విష్ణునివాసంతో పాటు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో రోజుకు 20 వేల టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. రద్దీ రోజుల్లో మరో 5 వేల టోకెన్ల కోటా పెంచుతున్నారు. ఈ టోకెన్లు పొందిన వారికి మరుసటిరోజు నుంచి దర్శనం కల్పిస్తున్నారు. 
 
అయితే.. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు కావొచ్చు లేదా స్థానికులు కొంతమంది కావొచ్చు మరుసటిరోజు వరకు ఆగకుండా టోకెన్‌ తీసుకున్న వెంటనే కొండెక్కేస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ఈ రద్దీని నియంత్రించాలని టీటీడీ నిర్ణయించింది. 
 
దీనిలో భాగంగా టైం స్లాట్‌ టోకెన్‌ పొంది కాలినడకన వచ్చే భక్తులను ఉదయం 9 గంటలకు, వాహనాల్లో వచ్చే వారిని మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అనుమతించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ నూతన విధానంపై నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం వంటివి ఆకస్మికంగా జరగడంతో సోమవారం పలువురు భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 
 
టోకెన్‌ ఉన్నా తమను ఎందుకు కొండపైకి పంపడం లేదని విధుల్లో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో కొత్త నిబంధనలపై సిబ్బంది వివరించి భక్తులను శాంతింపజేశారు. దీనిపై తితిదే అధికారులు స్పందిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తరహా విధానాన్ని అమల్లోకి తెచ్చామని, ఇందుకు భక్తులు కూడా సహకరించాలని కోరారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లై రెండు రోజులే.. వివాహ విందు కోసం సిద్ధంగా వున్నాడు.. ఇంతలో కరెంట్ షాక్‌తో మృతి

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

చిన్నారిపై అత్యాచారం - కన్నతల్లి సమక్షంలోనే ప్రియుడి పైశాచికత్వం

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

అన్నీ చూడండి

లేటెస్ట్

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

తర్వాతి కథనం
Show comments