Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న లడ్డూ ధర రూ.50.. పెద్ద లడ్డూ ధర రూ.200

శ్రీవారి భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పేరుతో భారం మోపింది. శ్రీవారి ప్రసాదాల ధరలను రెట్టింపు చేసింది. సిఫార్సు లేఖలపై ఇచ్చే ప్రసాదాల ధరను పెంచింది.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (09:40 IST)
శ్రీవారి భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పేరుతో భారం మోపింది. శ్రీవారి ప్రసాదాల ధరలను రెట్టింపు చేసింది. సిఫార్సు లేఖలపై ఇచ్చే ప్రసాదాల ధరను పెంచింది. ఫలితంగా ఇప్పటివరకు రూ.25కు విక్రయిస్తున్న చిన్న లడ్డూ ధరను రూ.50కు పెంచింది. అలాగే, పెద్ద లడ్డూ ధరను రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అలాగే, వడ ధరను రూ.25 నుంచి రూ.100కు పెంచింది. పెరిగిన నూతన ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.
 
మరోవైపు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో గురువారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 
 
నడకదారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2 గంటల సమయం పడుతోంది. కాగా... తిరుమల శ్రీవారిని బుధవారం 62, 351 మంది భక్తులు దర్శించుకున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

తర్వాతి కథనం
Show comments