శ్రీవారి భక్తులు అలా హెచ్చరించిన టిటిడి ఇఓ

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (23:06 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, స్పెసిఫైడ్ అథారిటీ కమిటీ చైర్మన్ డాక్టర్ జవహర్ రెడ్డి  శ్రీవారి భక్తులకు హెచ్చరించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. ఎవరో నిర్లక్ష్యంగా ఉండవద్దని మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని.. సామాజిక దూరాన్ని పాటించి తీరాలని సూచించారు.
 
కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని చాలామంది తిరుమలలో మాస్కులు ఉన్నా వేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని.. అలాగే గుంపులుగుంపులుగా కనిపిస్తున్నారని.. టీటీడీ సిబ్బంది ఎన్నిసార్లు భక్తులకు చెబుతున్న వినిపించుకోవడం లేదన్నారు ఇఓ. కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.
 
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పట్లో ఆన్‌లైన్‌లో టోకెన్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఇచ్చే టోకెన్లను 5 వేల నుంచి 8 వేలు చేశామన్నారు. అంతకుమించి టోకెన్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
 
టోకెన్లను పెంచాలన్న ఆలోచన కూడా తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు టోకెన్లను పెంచేస్తారన్న ఆలోచన అస్సలు లేదన్నారు. కరోనా తీవ్రత బాగా తగ్గిందని అనిపిస్తే అప్పుడు ఆలోచన, నిర్ణయాలు ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

తర్వాతి కథనం
Show comments