Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తులు అమ్మడం కొత్తేమీ కాదు : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Webdunia
సోమవారం, 25 మే 2020 (19:58 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డుకు నిరర్ధక ఆస్తులను విక్రయించడం కొత్తేమీ కాదనీ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. తితిదే భూముల వేలానికి సంబంధించి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ అవుతుండటం, గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, టీటీడీ భూముల వేలంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి కూడా ఆదేశాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. గత బోర్డు నిర్ణయాలపై మాత్రమే సమీక్షించామన్నారు. 
 
బోర్డు ఆస్తులు అమ్మడం ఇదేమీ కొత్త కాదని, 1974 నుంచి భూములను అమ్మినట్లు చెప్పారు. ఆస్తుల విక్రయానికి సంబంధించి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకొంటామన్నారు. అదేసమయంలో అన్యాక్రాంతం కాకుండా ఆస్తుల్ని అమ్మడం టీటీడీకి కొత్తకాదని అన్నారు. 
 
టీటీడీ భూములను వేలం వేయాలని గత బోర్డు సభ్యులే నిర్ణయించారన్నారు. 2016 జనవరి 30వ తేదీనే 50 ఆస్తుల వేలంపై టీడీపీ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకొన్నదని చెప్పారు. భూముల వేలంపై రెండు బృందాలను ఏర్పాటుచేశామని, భూముల పరిరక్షణకు మాత్రమే మేం నిర్ణయాలు తీసుకొంటున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

16-03-2025 ఆదివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

తర్వాతి కథనం
Show comments