Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, కౌంటర్ల ద్వారా సర్వదర్సనం టోకెన్లు, ఎప్పటి నుంచో తెలుసా..!

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (21:23 IST)
కోవిడ్ తగ్గుముఖం పట్టిన వెంటనే సర్వదర్సనం టోకెన్లను మంజూరు చేస్తామన్నారు టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి. ఫిబ్రవరి 15వ తేదీ తరువాత కౌంటర్ల ద్వారా సర్వదర్సనం టోకెన్లను అందించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. కోవిడ్ కేసులు తగ్గితే మార్చితే 1వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవల పునరుద్దరణ, పలు సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు.

 
స్వామివారి దర్సనం టిక్కెట్లు విక్రయించే నకిలీ వెబ్ సైట్లను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. నకిలీ వెబ్ సైట్ నిర్వాహకులను వదిలిపెట్టమన్నారు. టిటిడికి సంబందించిన అధికారిక వెబ్ సైట్ లోనే దయచేసి భక్తులు టోకెన్లను పొందవచ్చునన్నారు.

 
త్వరలో శ్రీవారి నడక మార్గం పునరుద్ధణ పనులకు సంబంధించిన టెండర్లను ఖరారు చేస్తామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చేందుకు మూడు నెలలకు పైగా సమయం పడుతుందన్నారు. 

 
బండరాళ్ళు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలను ముందస్తుగా గుర్తించే విధంగా సాంకేతికను తీసుకొస్తున్నామన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీన అంజనాద్రి అభివృద్థి పనులకు భూమి పూజ చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

తర్వాతి కథనం
Show comments