శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ యేడాది రెండు బ్రహ్మోత్సవాలు..!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టిటిడి అధికారులతో ఈఓ సమావేశమయ్యారు. ఈ యేడాది రానున్న రెండు బ్రహ్మోత్సవా

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (21:28 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టిటిడి అధికారులతో ఈఓ సమావేశమయ్యారు. ఈ యేడాది రానున్న రెండు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. సెప్టెంబర్ నెలలో ఒక బ్రహ్మోత్సవం, అక్టోబర్ నెలలో మరో బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 
 
సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నామని చెప్పారు. వాహన సేవలు యధావిధిగా ఉదయం రాత్రి వేళల్లో ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు 7 లక్షల లడ్డూలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పది రాష్ట్రాల నుంచి కళాకారులు కూడా బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఆగష్టు 31వ తేదీలోగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్.. గంజాయి స్మగ్లర్ల దాడి.. పరిస్థితి విషమం

రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు.. ఏం జరిగిందంటే?

అమరావతిలో చంద్రబాబు, పవన్.. 301 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు

Royal Sikh: రాజసం ఉట్టిపడే తలపాగాతో కనిపించిన పవన్ కల్యాణ్

గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో నిర్వహించాలి.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments