Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి విముక్తి కలగాలని తిరుమలలో సుందరకాండ పారాయణం

Webdunia
శనివారం, 29 మే 2021 (20:24 IST)
కరోనా వ్యాధి నిర్మూలనకు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు కోరుతూ ఇప్పటివరకు అనేక ధార్మిక కార్యక్రమాలు  నిర్వహించామని.. ఇందులో భాగంగా మే నెల 31వ తేదీన అఖండ సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు టిటిడి అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఙాన పీఠంలో గల ప్రార్థనా మందిరంలో శనివారం అఖండ పారాయణం ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం మీడియాతో ఈఓ మాట్లాడుతూ హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుంచి లంఘించి సీతాన్వేషణ కోసం ఏ విధంగా అవిశ్రాంతంగా కర్తవ్యదీక్ష చేశారో అదే విధంగా ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు 16గంటల పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నాలుగు బృందాల్లో 40మంది పండితులు పారాయణం చేసేందుకు వీలుగా ఇక్కడ ప్రార్థనా మందిరంలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు.
 
హోమం ఏర్పాటు చేసి ప్రతి శ్లోకం తరువాత హవనం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఇళ్ళ నుంచే ఎస్వీబీసీలో తిలకించవచ్చునన్నారు. అలాగే టివీలో చూసేటప్పుడు టీవీ సౌండ్ పెంచడం ద్వారా మంత్రపూర్వకమైన శ్లోకాల శబ్ధ తరంగాలు వాతావరణంలో కలిసి శ్రీవారి అనుగ్రహం కలుగుతుందన్నారు.
 
అఖండ సుందరకాండ పారాయణం కారణంగానే 31వ తేదీన శ్రీవారి కళ్యాణోత్సం, సహస్ర్త దీపాలంకరణ సేవను మాత్రమే  ఎస్వీబీసీలో స్ల్పిట్ చేసి ప్రత్యక్ష ప్రసారం చేస్తారని.. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మిగతా కార్యక్రమాల ప్రసారాలను రద్దు చేస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

తర్వాతి కథనం
Show comments