Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (11:59 IST)
కలియుగదైవం కొలువైవున్న తిరుమలలో శ్రీవారి పుష్కరిణి పూర్తిగా మూసివేశారు. పుష్కరిణికి అన్ని వైపులా ఉన్న గేట్లకు అధికారులు తాళాలు వేశారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసేందుకు వీలులేదు. 
 
ప్రతి యేటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టులో పుష్కరిణిని మూసివేసి కోనేరులోని నీటిని మార్చడం ఆనవాయితీ. అయితే, ఈ యేడాది నీటి ఎద్దడి కారణంగా పుష్కరిణి శుభ్రత పనులను వాయిదా వేశారు. తాజాగా, ఈ ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ప్రారంభించారు. 
 
నిల్వ ఉన్న మురుగునీటిని పైపుల ద్వారా నీటిశుద్ధి కేంద్రాలకు తరలించారు. నెల రోజులపాటు పుష్కరిణి శుద్ధి పనులు కొనసాగనున్నాయి. పుష్కరిణి అడుగుభాగం, మెట్లను పూర్తిగా శుభ్రం చేస్తారు. పాచి, చెత్తాచెదారాన్ని తొలగించి రంగులు వేస్తారు. అనంతరం 23 లక్షల గ్యాలెన్ల నీటితో పుష్కరిణిని నింపుతారు. 
 
ఈ పనులన్నీ పూర్తయిన అనంతరం వచ్చే నెల 6న పుష్కరిణిని పునఃప్రారంభిస్తారు. ఈ పనుల కారణంగా సాయంత్రం ఊరేగింపు సమయంలో ఉత్సవర్లకు సమర్పించే పుష్కరిణి హారతిని కూడా రద్దు చేశారు. పుష్కరిణి మరమ్మతులు పూర్తయ్యే వరకు భక్తులు స్నానపు గదుల్లోనే స్నానమాచరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

19-07-2025 శనివారం దినఫలితాలు - ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు...

Sravana Masam 2025: శ్రావణ మాసం: తులసి, బిల్వ మొక్కలను నాటితే ఏంటి ఫలితం?

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జననం

తర్వాతి కథనం
Show comments