ఆంధ్ర మహాభారతం 108 పద్యగానమాలిక ఆడియోను ఆవిష్కరణ

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (12:54 IST)
పూజ్యశ్రీ జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య మహస్వామి డా.గజల్ శ్రీనివాస్ గానం చేసిన కవిత్రయం రచించిన శ్రీ అంధ్ర మహాభారతంలోని 108 పద్యాల ఆడియో సమర్పణ కార్యక్రమo ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని పేరూరు గ్రామంలో అనేక మంది భక్తుల సమక్షంలో జరిగింది. 
 
కవిత్రయం రచించిన అంధ్ర మహాభారతంలోని పద్యాలు బాల బాలికలు, యువతీ యువకులు పఠించడం ఎంతో అవసరమని, దీనివల్ల తెలుగు భాషా వైభవం, భక్తితత్వం, అత్యంత సుందరమైన భావవ్యక్తీకరణ వారికి అర్థమవుతాయని శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఈ సందర్భంగా అన్నారు. 
 
శ్రీ కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి జన్మదిన సందర్భంగా 20 డిసెంబర్ 2022 రోజున కొవ్వూరు సంస్కృత విద్యా పీఠం వేదికగా వేలాదిమంది బాల బాలికలచే ఈ 108 పద్యాలను వివిధ ప్రాంతాల నుండి ఒకే సమయంలో సామూహికంగా గానం చేయించే ప్రయత్నం కంచి కామాక్షి పీఠం చేపట్టునున్నదని నిర్వాహకులు తెలిపారు. 
 
ఈ 108 పద్యాలను అందరూ సులువుగా పాడుకునే విధంగా గానం చేసి ధ్వని ముద్రితం చేసిన సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు, ప్రముఖ గాయకులు డా.గజల్ శ్రీనివాస్‌ను శ్రీ కంచి శంకర విజయేంద్ర స్వామి అభినందించి తీర్థ ప్రసాదాలను అందినట్టు గజల్ శ్రీనివాస్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments