Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8న చంద్రగ్రహణం - శ్రీవారి ఆలయం మూసివేత

Advertiesment
ttd temple
, సోమవారం, 7 నవంబరు 2022 (10:43 IST)
ఈ నెల 8వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం కనిపించనుంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంను మూసివేయనున్నారు. మొత్తం 11 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. 8వ తేదీ ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజల తర్వాత శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు. 
 
కాగా, చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 గంటలకు నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తెరిగి తెరుస్తారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 
 
చంద్రగ్రహణం నేపథ్యంలో 7న సిఫారసు లేఖలు స్వీకరించబోడవం లేదని తితిదే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 8వ తేదీన గ్రహణం రోజున సర్వదర్శనం టోకెన్లను కూడా జారీ చేయడం లేదని చెప్పారు. బ్రేక్ దర్శనాలు, అర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి దర్శనం: క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి వుండాల్సిన పనిలేదు..