Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనవరి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్ ఎపుడంటే...?

Tirumala
, ఆదివారం, 11 డిశెంబరు 2022 (10:11 IST)
కలియుగదైవం శ్రీవారి ఆర్జితసేవా జనవరి కోటా టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు అధికారులు వెల్లడించాయి. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్‌లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని వివరించింది. ఆ తర్వాత లక్కీడిప్ ద్వారా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని తితిదే తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-12-2022 ఆదివారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...