టోకెన్లు ఉంటేనే రథసప్తమి రోజు వాహనసేవలకు అనుమతి: టిటిడి ఈఓ

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (20:32 IST)
రథసప్తమి అంటే ఒక పండుగ. సప్తవాహనాలపై శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్సనమిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల్లో సాధారణంగా ప్రతిరోజు ఒక వాహన సేవను తిలకిస్తాము. అదే రథసప్తమిరోజు అయితే ఒకేరోజు అన్ని వాహనసేవలను తిలకించే అవకాశం ఉంటుంది.
 
ఇది ఎప్పటి నుంచో ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే కోవిడ్ కారణంగా ఈ యేడాది రథసప్తమి వాహనసేవలను తిలకించాలంటే భక్తులకు ఖచ్చితంగా టోకెన్లు ఉండాలి. టోకెన్లు అంటే దర్సనానికి సంబంధించిన టోకెన్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు టిటిడి ఈఓ జవహర్ రెడ్డి 
 
తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫిబ్రవరి 19న సూర్యజయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకగా నిర్వహిస్తామని.. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు చక్రస్నానం జరుగుతుందన్నారు. 
 
స్వామివారు ఒకేరోజు ఏడు ప్రధాన వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగడం వల్ల దీన్ని ఒకరోజు బ్రహ్మోత్సవాలని, ఉప బ్రహ్మోత్సవాలని పిలుస్తారని చెప్పారు. రథసప్తమి రోజు స్వామివారి దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

జై గురుదత్త

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

తర్వాతి కథనం
Show comments