Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త.. ఏంటది..?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:52 IST)
శ్రీవారి భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఓ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతికి రిజర్వేషన్ చేయించుకునే సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం కూడా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ టిక్కెట్ ధర రూ.300. ఈ టిక్కెట్‌తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. 
 
తిరుపతికి వెళ్లే దూరప్రాంత సర్వీసులకు ఈ సదుపాయం వర్తిస్తుందని, ప్రయాణ చార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి ఉదయం 11 గంటల స్లాట్‌లో, ఆపై సాయంత్రం 4 గంటల స్లాట్‌లో టికెట్లను ఎంచుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రోజుకు 1000 టిక్కెట్లను జారీచేస్తారు. 
 
ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్‌లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పైగా, వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments