శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (16:58 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మరోమారు వెనక్కి తగ్గింది. ఇటీవల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 
 
ఈ టిక్కెట్ల పెంపుపై తితిదే పాలక మండలి సభ్యుల మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చర్చ చేపల మార్కెట్‌లో బేరం చేసినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై తితిదే తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 
 
శ్రీవారి ఆలయంలో కరోనా కారణంగా గత రెండేళ్ళుగా భక్తులను అర్జిత సేవలకు అనుమతించడం లేదు. దర్శనానికి కూడా పరిమిత సంఖ్యలోనే అవకాశం కల్పిస్తున్నారు. గత పాలక మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై చర్చ చేపట్టారు. 
 
సామాన్య భక్తులకు ధరలు పెంచబోమంటూనే సిఫారసు లేఖలపై కేటాయించే అర్జిత సేవా టిక్కెట్ల ధరలను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. అర్జిత సేవా టిక్కెట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం విజయ్ ఎఫెక్ట్.. కాశ్మీర్‌కు పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం, ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా పరిధిలో నెట్‌వర్క్ నాణ్యతను ట్రాయ్ అంచనా

విశాఖను విశ్వనగరంగా చేస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

తడబడుతున్న సీఎం విజయ్, నిన్న నియామకం, ఇవాళ రద్దు

జ్యోతిష్యుడి నియామకం రద్దు చేసిన సీఎం విజయ్ సర్కార్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

11-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

తర్వాతి కథనం
Show comments