శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (16:58 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మరోమారు వెనక్కి తగ్గింది. ఇటీవల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 
 
ఈ టిక్కెట్ల పెంపుపై తితిదే పాలక మండలి సభ్యుల మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చర్చ చేపల మార్కెట్‌లో బేరం చేసినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై తితిదే తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 
 
శ్రీవారి ఆలయంలో కరోనా కారణంగా గత రెండేళ్ళుగా భక్తులను అర్జిత సేవలకు అనుమతించడం లేదు. దర్శనానికి కూడా పరిమిత సంఖ్యలోనే అవకాశం కల్పిస్తున్నారు. గత పాలక మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై చర్చ చేపట్టారు. 
 
సామాన్య భక్తులకు ధరలు పెంచబోమంటూనే సిఫారసు లేఖలపై కేటాయించే అర్జిత సేవా టిక్కెట్ల ధరలను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. అర్జిత సేవా టిక్కెట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన వరంగల్ వ్యక్తి

Thunderstorms: ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు

Donald Trump: కృత్రిమ మేధస్సును ఉపయోగించి నకిలీ చిత్రాలు.. డొనాల్డ్ ట్రంప్

చైన్ స్నాచింగ్.. రూ.7లక్షల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలు సీజ్

నెతన్యాహు లైవ్ వీడియో, హుషారుగా కాఫీ తాగుతూ ఇజ్రాయెల్ ప్రధాని

అన్నీ చూడండి

లేటెస్ట్

Vastu for Wearing a Watch: కుడి లేదా ఎడమ.. ఏ చేతికి వాచ్ కట్టాలో తెలుసా?

12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

తర్వాతి కథనం
Show comments