Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్నా నీకిదితగునా... టిక్కెట్ కొంటేనే నీ దర్శనభాగ్యమా?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (17:33 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనం నానాటికీ కరువైపోతోంది. టిక్కెట్ కొంటేనే శ్రీవారిని చూపిస్తామంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, తితిదే అధికారుల తీరు ఉంది. వారు వ్యవహారశైలికూడా అలానే, కోవిడ్ నిబంధనల పేరుతో సర్వదర్శనం నిలిపివేసిన తితిదే అధికారులు... ఏదో ఒక టిక్కెట్ కొనుగోలు చేస్తే మాత్రం శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. అంటే.. డబ్బులుంటేనే వెంకన్న దర్శనభాగ్యంగా మారింది. 
 
గత మార్చి నెలలో కోవిడ్ వైరస్ నియంత్రణ కోసం కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. కొన్ని నెలల పాటు సాగింది. ఆ సమయంలో కఠిన ఆంక్షలు అమలు చేశారు. ప్రస్తుతం ఈ లాక్డౌన్‌ను దశల వారీగా సడలిస్తూ వస్తున్నారు. అయితే, తితిదే అధికారులు మాత్రం కోవిడ్ నిబంధనల పేరుతో సర్వదర్శనం నిలిపివేశారు. దీంతో శ్రీవారి దర్శించుకోవాలన్న పేదవారు ఇపుడు ఏడుకొండలెక్కలేని పరిస్థితి నెలకొంది. 
 
అదేసమయంలో ప్రస్తుతం స్వామిని దర్శించుకుంటున్న వారంతా టికెట్లు కొన్నవారే. ఇలాంటి పరిస్థితి ముందెప్పుడూ లేదంటూ టీటీడీపై విమర్శలు తీవ్రమవుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అలిపిరికి చేరుకుని గుమికూడుతున్నారంటూ కొవిడ్‌ నిబంధనల పేరుతో సెప్టెంబరు 6 నుంచి ఉచిత టికెట్ల జారీని టీటీడీ అధికారులు రద్దు చేశారు. 
 
అలాగే, సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ.. సెప్టెంబరు 10వ తేదీ నుంచి ఆ 3 వేల టిక్కెట్ల కోటాను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మళ్లించింది. రోజుకు 16 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తోంది. 
 
వీటితో పాటు వీఐపీలకు బ్రేక్‌ దర్శనాలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళాన్ని ఇచ్చిన భక్తులకు, బోర్డు సభ్యుల సిఫారసుపై రూ.300 సుపథం ప్రవేశం, రూ.1000తో ఆన్‌లైన్‌ కల్యాణోత్సవం టికెట్లు కొన్నవారికి ప్రస్తుతం దర్శనం చేయిస్తున్నారు. 
 
ఇలా స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజుకు 20 వేలు దాటుతోంది. మొత్తమ్మీద ఏదో టికెట్టు కొనుగోలు చేస్తే కానీ శ్రీవారి దర్శనం లభించే పరిస్థితి లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నా తితిదే అధికారులతో పాటు.. పాలక మండలి మాత్రం నోరు మెదపడం లేదు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments