Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువు చెప్పాడని ఎదురుగా వచ్చిన స్త్రీని సంహరించిన రాముడు...

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (22:12 IST)
ఎన్నో జన్మల పుణ్యం వలన మానవజన్మ వస్తుంది. ఈ మానవజీవితం సార్ధకం కావాలి అంటే గురువును గురించి తెలుసుకోవాలి. గురువే తల్లి, తండ్రి, దైవం. గురువును మించిన దైవం లేదు. గురువు వాక్కే వేదవాక్కు. గురువు వాక్కును శిరసావహించిన వారిని చూసి శివకేశవులు కూడా ఎంతో సంతోషిస్తారు. 
 
బాలకాండలో గురువు ఆజ్ఞను గురించి ఇలా చెప్పబడింది. యాగసంరక్షణార్ధం రామలక్ష్మణులు అడవిలో విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెడుతున్న సమయంలో విశ్వామిత్ర మునికి తమకెదురుగా ఒక స్త్రీ రావడం కనపడింది. విశ్వామిత్రులవారు రామునితో ఆమెను ఒక్క బాణంతో చంపమని ఆజ్ఞాపించారు.
 
తమకు అపకారం చేయని ఒక స్త్రీని చంపడం పాపమని రాముడు మెుదట సందేహించాడు. ఒక్క క్షణమాగి, తరువాత గురువు ఆజ్ఞను పాలించడమే ముఖ్య కర్తవ్యమని తలంచి బాణానెక్కుపెట్టి ఒక్క బాణంతో ఆ స్త్రీని వధించినాడు. తరువాత ఆ స్త్రీ తాటకి అనే రాక్షసి అని తెలుసుకున్నాడు. శ్రీరాముడు మరేమీ ప్రశ్నించకుండా తన గురువు యెుక్క ఆజ్ఞను పాలించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ నెల 24 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

అత్యాచారం చేసి స్క్రూడ్రైవర్‌తో ప్రియురాలిని హత్య చేశాడు.. నిందితుడికి జీవిత ఖైదు

కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆసక్తికర పరిణామం : కుమార్తె కవిత ఇంటికి వెళ్లిన తల్లి శోభ

AP Ration Cards: ఏటీఎం కార్డులను పోలిన స్మార్ట్ రేషన్ కార్డులు

మెగా డీఎస్సీకి మెలిక పెట్టిన విద్యాశాఖ.. భర్త పేరుపైనే ఈడబ్ల్యూఎస్ ధృవపత్రాలు ఉండాలి...

అన్నీ చూడండి

లేటెస్ట్

Naimisharanya: బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సమక్షంలో నైమిశారణ్యంలో పూర్తయిన భాగవత సప్తాహం

TTD: అన్నప్రసాద సేవ కోసం కూరగాయల విరాళాలు.. డైనమిక్ వ్యవస్థ సిద్ధం

Sankatahara Chaturthi 2025: బుధవారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే?

10-09-2025 బుధవారం ఫలితాలు - కీలక పత్రాలు.. నగదు జాగ్రత్త...

09-09-2025 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం....

తర్వాతి కథనం
Show comments