భాగవత శ్రవణంతో మోక్షప్రాప్తి...

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (12:30 IST)
లౌకికమైన బంధాల్లో చిక్కుకున్న మనిషిని సంసారబంధనాల నుంచి విముక్తిడిని చేసి కైవల్యానికి మార్గం చూపే దారిదీపంగా భాగవతం నిలుస్తుందని, కేవలం భాగవతాన్ని వినటంతోనే ముక్తి లభిస్తుందని ప్రముఖ పండితులు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి అన్నారు. 
 
లబ్బీపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యాన అక్కడి శ్రవణమంటపంలో శనివారం భాగవత సప్తాహం ప్రారంభమైంది. దత్తాత్రేయశాస్త్రి ప్రచనం చేస్తూ పరీక్షిత్తు మహారాజుకు ఇచ్చిన శాపం లోకానికి వరంగా మారిందన్నారు. 
 
భగవంతుడి లీలల్లో అనేకమైన అంతరార్థాలు దాగి ఉంటాయని, విచక్షణ కోల్పోయి వితండవాదంతో పరమాత్మ లీలల్ని ప్రశ్నించటం సరికాదన్నారు. అనంతమైన సాహిత్యాన్ని సృష్టించిన వ్యాసమహర్షికి సైతం భాగవత రచన వల్లే సాంత్వన చేకూరించదన్నారు. 
 
భాగవతం కేవలం భగవంతుడి కథల సమాహారం మాత్రమే కాదని, అనంతమైన ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విషయాలకు నిలయమని చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి శిష్యులు నారాయణేంద్ర సరస్వతీస్వామి, కైవల్యానంద సరస్వతి, శంకరానంద సరస్వతీస్వామి కూడా పాల్గొన్నారు. 
 
తొలుత విఘ్నేశ్వరపూజ, అనంతరం శాస్త్రవిధానంగా అర్చన చేసి సప్తాహాన్ని ప్రారంభించారు. దేవస్థాన పాలకమండలి అధ్యక్షుడు మాగంటి సుబ్రహ్మణ్యం కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మగాళ్లు కూడా వీధి కుక్కల్లాంటివారు.. ఎపుడు అత్యాచారం - హత్య చేస్తారో తెలియదు : నటి రమ్య

ఏం దేశం వెళ్లిపోదాం? ఆలోచిస్తున్న ఇరాన్ ప్రజలు, ఎందుకు?

తెలంగాణ మహిళా మంత్రులను సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్... ఎందుకో తెలుసా?

కుక్కల కంటే పిల్లుల్ని పెంచుకోమన్న సుప్రీం.. సంగారెడ్డిలో బాలుడిపై వీధికుక్కల దాడి

ISRO PSLV-C62: పీఎస్‌ఎల్‌వి-సి62 రాకెట్ ద్వారా ఈఓఎస్-ఎన్1 ప్రయోగం.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Lambodara Sankashti Chaturthi: లంబోదర సంకష్టహర చతుర్థి 2026.. లంబోదరుడిని ప్రార్థిస్తే?

06-01-2026 మంగళవారం ఫలితాలు - ప్రారంభించిన పనులు మధ్యలో ఆపివేయొద్దు...

గోరింటాకు చెట్టుకు సీతమ్మకు ఏంటి సంబంధం.. గోరింటాకు చెట్టును పూజిస్తే?

05-01-2026 సోమవారం ఫలితాలు - ధనసహాయం, చెల్లింపులు తగవు...

04-01-2026 నుంచి 10-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments