కార్తీక మాసం చివరి సోమవారం... కార్తీక పుణ్యస్నానం చేస్తే...

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (23:14 IST)
పరమేశ్వరుని ఆరాధనకు తెల్లవారు జామున స్నానం చేయాల్సిందే. లేకుంటే పూజా మందిరంలో ప్రవేశించకూడదని పెద్దలు, పండితులు చెబుతారు. ప్రతి రోజూ నియమానుసారం స్నానం చేస్తే.. ఆయుష్షు పెరుగుతుందనేది నమ్మకం. మన చెంతనే ఉన్న నదీలో కార్తీక స్నానం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.

 
ఇక కార్తీక సముద్ర స్నానాలు చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి. కార్తీకమాసంలో చంద్రకిరణాల రూపంలో అమ్మవారు నీటిని అమృతధారగా మార్చి ఆశీర్వదిస్తుందనేది అందరి నమ్మకం. నదిలో మూడుసార్లు మునిగితే..శరీరమంతా చంద్రకిరణ అమృత స్పర్శతో తేజోవంతమవుతుంది. ఔషధ శక్తి వచ్చి..అనారోగ్యం కలగదని పెద్దలంటారు. కార్తీక మాసంలో నదీ స్నానానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చిత్తశుద్ధిలేని శివపూజలేలరా..అన్నట్టు మనం చేసేదైమైనా చాలా మనసులగ్నం పెట్టి చేసి తీరాల్సిందే.

 
నదీ స్నానం సందర్భంగా ఒంటిపై వస్త్రం ఉంచుకుని...ఒక సత్సంకల్పంతో స్నానమాచరిస్తే తగిన కార్తీక పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. అది మానవులకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా నదీ స్నానంతోనే పుణ్య కార్యం అయిపోయిందనుకోకూడదు. తోచనంతగా ధానధర్మాలు చేస్తేనే తగిన పుణ్యం వస్తుంది. అందుకే కార్తీకస్నానాలతోపాటు భక్తజనమంతా శివపూజలు, అభిషేకాలు, ధానధర్మాలు చేస్తే.. భక్తిఫలం దక్కుతుంది. సర్వజయం సిద్ధిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

లేటెస్ట్

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

తర్వాతి కథనం
Show comments