చింతామణి గణపతి అనుగ్రహం.... అందరి కోరకలు నెరవేరుస్తూ....

భక్తుల చింతలు తీరుస్తూ వారిచే 'చింతామణి గణపతి' గా విశేష పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రం పూణే జిల్లా హవేలీ తాలూకాలోని ధేవూర్‌లో వెలసింది. ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణాన్ని స్థలపురాణం చెబుతోం

Webdunia
శనివారం, 14 జులై 2018 (11:40 IST)
భక్తుల చింతలు తీరుస్తూ వారిచే 'చింతామణి గణపతి' గా విశేష పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రం పూణే జిల్లా హవేలీ తాలూకాలోని ధేవూర్‌లో వెలసింది. ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణాన్ని స్థలపురాణం చెబుతోంది. పూర్వం అభిజిత్తు - గుణవతి అనే రాజ దంపతులకు ఓ మగబిడ్డ జన్మించాడు. ఆ దంపతులు అతనికి గణరాజు అనే పేరు పెట్టారు.
 
యుక్త వయస్కుడైన గణరాజు ఓ రోజున తన పరివారంతో కలిసి వేటకు వెళ్లాడు. విపరీతమైన ఎండ ఉన్న కారణంగా 'కపిలమహర్షి' ఆశ్రమంలో సేదదీరాడు. ఆ సమయంలోనే కపిలమహర్షి దగ్గర ఉన్న 'చింతామణి' ని చూశాడు. కోరిన కోరికలను తక్షణమే తీర్చే ఆ చింతామణిని తనకి ఇవ్వమని అడిగాడు. అందుకు కపిలుడు నిరాకరించడంతో బలవంతంగా దానిని తీసుకుపోయాడు.
 
దాంతో కపిలుడు విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేశాడు. వినాయకుడు ప్రత్యక్షం కావడంతో జరిగింది వివరించి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. దాంతో వినాయకుడు గణరాజును సంహరించి ఆ చింతామణిని కపిలుడికి అప్పగించాడు. కపిలుడి ప్రార్థన మేరకు ఆ ప్రదేశంలోనే స్వయంభువుగా వెలిశాడు. నాటి నుంచి నేటి వరకు భక్తుల అభీష్టాలను నెరవేరుస్తూ నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ ఏపీకి దీర్ఘకాలిక గేమ్ ఛేంజర్‌లుగా ఉంటాయి: చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కొరియన్ మోనోగ్లిజరైడ్స్.. సిట్ విచారణలో వెల్లడి

కూనో జాతీయ పార్కులో ఐదు కూనలకు జన్మనిచ్చిన ఆశా చిరుత

Jogi Ramesh: జోగి రమేష్‌పై మరోసారి నాన్ బెయిలబుల్ కేసు

తిరుమల శ్రీవారి లడ్డూల్లో రెండు రోజుల్లోనే దుర్వాసన.. జాతీయ జర్నలిస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

05-02-2026 గురువారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం...

తిరుమలలో వార్షిక తెప్పోత్సవాలు.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ

04-02-2026 బుధవారం రాశి ఫలితాలు, మీ కష్టం ఫలిస్తుంది

03-02-2026 మంగళవారం రాశి ఫలితాలు- రుణ సమస్య పరిష్కారమవుతుంది

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

తర్వాతి కథనం
Show comments