భాగవతంలో ఏముంది? ఎవరు భాగవతాన్ని వింటున్నారో..?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (19:27 IST)
భాగవతంలో ఏముంది? ధర్మం ఉంది. సత్య దర్శనం ఉంది. దాన్ని నిర్మొహమాటంగా బోధించి మనిషిని సరైన మార్గంవైపు మళ్ళించే తత్వం ఉంది. అదే సుఖజీవనానికి, తద్వారా మోక్షానికి మార్గమనే జ్ఞాన బోధ ఉంది.
 
అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం కలుగుతుంది. మరణభయంలో అజ్ఞానం, అవిద్య ఉన్నాయి. అవి జీవిని అధోగతికి చేర్చుతాయి. కాబట్టి ఏది సత్యమో దాన్ని పట్టుకోగలగాలి. భాగవతాన్ని విన్నవారు లేక చదివినవారు మాత్రమే ఆ సత్యాన్ని తేలికగా పట్టుకోగలరు. దేనికైనా తట్టుకోగలరు. అలా పట్టుకునే జీవితసత్యాల గురించి భాగవతంలో ప్రతిపాదన చేశారు.
 
ఎవరు భాగవతాన్ని వింటున్నారో లేక చదువుతున్నారో వారికి సత్యంపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుడి (అంతర్యామి) పట్ల దృష్టి మరలుతుంది. ఆయన పాదాలు పట్టుకున్నవాళ్లు ఎలా తరించారో భగవంతుడి భక్తుల గాథలుగా భాగవతం బోధిస్తోంది. 
 
అంత సరళంగా భాగవతాన్ని శుక బ్రహ్మ ప్రవచనం చేశారు. దాన్ని అక్షరబద్ధం చేసింది వ్యాసభగవానుడు. మన అదృష్టం కొద్దీ ఆ జ్ఞాన సంపద మనందరికీ అందుబాటులో ఉంది. అందుకోగలిగిన వారికి ఆనందం కలుగుతుంది. అందుకోలేనివారికి అయోమయం మిగులుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీ టైమ్ పూర్తయింది.. ఇపుడు మా టైమ్ మొదలైంది : కె.కవిత

మహిళ పాలనలో బెంగాల్ మహిళలకు రక్షణ లేదు : ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణాలో జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

డిన్నర్ మీట్ కాల్పుల నిందితుడు మెకానికల్ ఇంజనీర్...

కూల్‌డ్రింక్స్ అందించే ట్రాలీ గది సమీపంలో నక్కిన నిందితుడు కోలో టోమోస్ అలెన్

అన్నీ చూడండి

లేటెస్ట్

పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

Masik Durgashtami: దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ.. ఎవరైతే విజయం కోరుకుంటారో?

24-04-2026 శుక్రవారం ఫలితాలు - పొదుపు ధనం అందుకుంటారు.

వైశాఖ మాసం.. అష్టమి రోజున కాలభైరవ పూజ చేస్తే.. కుంకుమ దానంతో...?

23-04-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

తర్వాతి కథనం
Show comments