ఆది వరాహస్వామి మహిమలు.... భక్తులు దర్శించుకుంటూ....

సమస్త భూ మండలాన్ని జలసమాధి చేయడానికి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ప్రయత్నించినప్పుడు అతణ్ణి సంహరించి భూదేవిని రక్షించడం కోసం సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారమెత్తాడు. ఆ రాక్షసుడిని అంతంచేసి జల గ

Webdunia
శనివారం, 14 జులై 2018 (11:27 IST)
సమస్త భూ మండలాన్ని జలసమాధి చేయడానికి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ప్రయత్నించినప్పుడు అతణ్ణి సంహరించి భూదేవిని రక్షించడం కోసం సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారమెత్తాడు. ఆ రాక్షసుడిని అంతంచేసి జల గర్భంలోని భూమిని తన కోరలతో పైకెత్తి బయటికి తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా శ్రీ మహా విష్ణువెత్తిన ఈ వరాహ అవతారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
ఈ అవతారంలో స్వామివారు రెండు ప్రదేశాల్లో మాత్రమే వెలిశారు. ఒకటి తిరుమల తిరుపతి కొండపైనా, మరొకటి కరీంనగర్ జిల్లాలోని కమాన్ పూర్ లోను ఉంది. తిరుమలలో వెలసిన ఆది వరాహ స్వామి ప్రధాన పూజలు అందుకుంటుంటాడు. ఎందుకంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడికి ఆశ్రయమిచ్చినది ఆయనే. ఇక కమాన్ పూర్ విషయానికి వస్తే ఇక్కడ స్వామివారు ఒక రాయిపై వెలిశాడు.
 
మొదటి నుండి చూస్తున్నవారు తరచుగా దర్శించుకునే భక్తులు ఇక్కడి ఆది వరాహస్వామి వారు పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఎంతో విశిష్టమైనదిగా, మరెంతో మహిమాన్వితమైనదిగా చెప్పుకుంటోన్న ఈ క్షేత్రాన్ని స్థానికులు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఆది వరాహస్వామిని దర్శించుకుని ధన్యులవుతుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామపక్షం అందించారు, ఇక తమిళనాడు సీఎంగా TVK విజయ్

సింహాల గుంపుకు చుక్కలు చూపించిన పాము.. వీడియో వైరల్

ఫాస్టర్ కాదు కిరాతకుడు.. మైనర్ బాలికపై అత్యాచారం.. గర్భనిరోధక మందులిచ్చి...?

వరంగల్ జిల్లాలో పురాతన ఆలయం కూల్చివేత.. ఖండించిన బీజేపీ

ఒంగోలు వర్కర్స్ సైరన్‌కు ఆరు దశాబ్దాలు పూర్తి.. కోడి కూయడం కాస్త ఆలస్యం కావచ్చు.. కానీ?

అన్నీ చూడండి

లేటెస్ట్

05-05-2026 మంగళవారం ఫలితాలు - గిట్టని వ్యక్తులతో జాగ్రత్త

04-05-2026 సోమవారం ఫలితాలు - బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి...

03-05-2026 ఆదివారం ఫలితాలు - వస్త్రప్రాప్తి - ధనలాభం.. ఖర్చులు సామాన్యం....

03-05-2026 నుంచి 09-05-2026 వరకు మీ వార ఫలితాలు

Ghee Adulteration Row: శ్రీవారి లడ్డూలో కల్తీ, భారీ లోపాలను ఎత్తిచూపిన ప్యానెల్

తర్వాతి కథనం
Show comments