Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం రోజు ఒక పూట మాత్రమే భుజించి...?

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (11:02 IST)
శనివారం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజుగా పండితులు చెప్తుంటారు. వైష్ణవులు శనివారం రోజున శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శనివారం రోజున శుచిగా స్నానమాచరించి తులసికోట ముందు నేతితో గాని, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా తులసికోట ముందు దీపమెలిగిస్తే.. ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం. 
 
అలానే శనివారం సాయంత్రం శ్రీమన్నారాయణుని ఆలయాన్ని సందర్శించుకుని నేతితో దీపమెలిగించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని పురోహితులు చెబుతున్నారు. శనివారం రోజు ఒక పూట మాత్రమే భుజించి, శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుడిని ధ్యానించే వారికి శనిగ్రహ ప్రభావంచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
 
ఇంకా తొమ్మిది వారాల పాటు నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని, విష్ణుమూర్తి ఆలయాన్ని తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్, వైజాగ్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

Revanth Reddy: రాఖీ సావంత్‌తో కేసీఆర్‌ను పోల్చిన రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

మంగళగిరి చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక నిర్ణయం ఏంటది?

లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

టాయిలెట్ సీటును నాలుకతో నాకిస్తూ స్కూల్‌లో ర్యాగింగ్... 26వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు...

అన్నీ చూడండి

లేటెస్ట్

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

మౌని అమావాస్య వేళ త్రివేణి యోగం.. ఈ మూడు రాశులకు లాభాలు

29-01-2025 బుధవారం దినఫలితాలు : పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

Mauni Amavasya: మౌని అమావాస్య, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments