Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (09:42 IST)
కార్తికమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ద చతుర్దశి తిథినే వైకుంఠ చతుర్దశి అంటాం. ఈ రోజున విష్ణుమూర్తితో పాటూ శివుడిని కూడా తప్పకుండా పూజించాలి. అలా పూజిస్తే మోక్షం పొందవచ్చు. చతుర్దశి తిథి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే ప్రత్యేకించి ఈ వైకుంఠ చతుర్దశి తిథిని శివకేశవులకు ఇద్దరికీ సంబంధించిన తిథిగా చెప్పవచ్చు. 
 
సహస్ర కమలాలతో శ్రీ మహావిష్ణువును సహస్రనామాలతో అర్చించి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాదు ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీ కళ్యాణం జరుపుకోలేకపోయారో వారు ఈ రోజున విశేషించి సాయంత్రం చతుర్దశి తిథి ఉన్న సమయంలో తులసీ వివాహం చేసుకోవచ్చు.
 
వైకుంఠ చతుర్దశి రోజు విష్ణువు ఆలయం లేదా శివాలయంలో దీపదానం చేయడం విశేషంగా చెప్పవచ్చు. అందులోనూ రాగి లేదా, ఇత్తడి లోహాలతో తయారు చేసిన కుందుల్లో దీపాలను వెలిగించి, వాటిని బ్రాహ్మణుడికి దక్షిణా పూర్వకంగా, మంత్రపూర్వకంగా దీపదానం చేస్తే మరుజన్మ ఉండదని పురాణ వచనం. ఈ విధంగా చేయడం వల్ల పూర్వజన్మలో, ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలిగిపోయి సమస్త శుభాలూ చేకూరుతాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments