Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో భాగ‌మే- మధురై హైకోర్టు

Advertiesment
kasturi

సెల్వి

, బుధవారం, 13 నవంబరు 2024 (12:58 IST)
తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో భాగ‌మేన‌ని మ‌దురై ధ‌ర్మాస‌నం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. న‌టి క‌స్తూరి తెలుగు ప్ర‌జ‌ల‌పై చేసిన కామెంట్లు చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిపై మ‌దురై తిరున‌గ‌ర్‌లో నాయుడు మ‌హాజ‌న్ సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
 
ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ్గా.. న‌టి క‌స్తూరి త‌ర‌ఫున మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, సూచించిన వర్గానికి చెందిన వారిపై మాత్రమే మాట్లాడారని, ఈ విషయమై వివరణ ఇచ్చి, క్షమాపణలు కోరిన తర్వాత కూడా కేసు నమోదైంది. 
 
ఈ కేసు పిటిష‌న్‌పై ఇరువురి తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. మరో కేసు విచారిస్తున్న సమయంలో హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నటి కస్తూరి హాజరయ్యారు. వీడియో ఆఫ్‌ చేసి మైక్‌ మాత్రమే ఆన్‌లో ఉంచి ఆమె మాట్లాడినట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లగచర్ల దాడి కేసు : భారాస మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి అరెస్టు