Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో వేడుకలు జనవరి 1 నుంచి 11 వరకు..

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (18:15 IST)
వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సదుపాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. వైకుంఠ ఏకాదశి పుణ్యకాలం దగ్గరలోనే ఉంది. వైకుంఠ ఏకాదశి వేడుకలు పది రోజుల పాటు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 2 జనవరి 2023 నుండి 11 జనవరి 2023 వరకు నిర్వహించబడుతుంది.
 
దాదాపు రూ.300 ధర ఉండే ప్రత్యేక దర్శనం టిక్కెట్లు డిసెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచబడ్డాయి. ఈ టిక్కెట్‌లు, ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత జనవరి 1 నుండి 11 వరకు వర్తిస్తాయి.  
 
తిరుమల వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని ప్రతిరోజు దాదాపు 50 వేల మంది సందర్శిస్తుంటారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి టిక్కెట్ కొనుగోలు కోసం ఆన్‌లైన్ డిజిటల్ సేవలను అమలు చేసింది. 
 
డిసెంబర్ 23, 2022, తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో వార్షిక అధ్యాయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సుదీర్ఘ వార్షిక కార్యక్రమం వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు ప్రారంభమై జనవరి 15న ముగుస్తుంది.
 
ఈ సందర్భంగా 12 మంది ఆళ్వార్లు రచించిన నాలాయిర దివ్యప్రబంధ పాశురములు అని పిలువబడే మొత్తం 4000 కీర్తనలు ప్రతిరోజూ పఠించబడతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

Sravana Masam: శ్రావణ మాసం ప్రారంభం.. శుక్రవారం రోజున తామర పూలతో మాలను అమ్మవారికి?

25-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

తర్వాతి కథనం
Show comments