Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో వేడుకలు జనవరి 1 నుంచి 11 వరకు..

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (18:15 IST)
వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సదుపాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. వైకుంఠ ఏకాదశి పుణ్యకాలం దగ్గరలోనే ఉంది. వైకుంఠ ఏకాదశి వేడుకలు పది రోజుల పాటు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 2 జనవరి 2023 నుండి 11 జనవరి 2023 వరకు నిర్వహించబడుతుంది.
 
దాదాపు రూ.300 ధర ఉండే ప్రత్యేక దర్శనం టిక్కెట్లు డిసెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచబడ్డాయి. ఈ టిక్కెట్‌లు, ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత జనవరి 1 నుండి 11 వరకు వర్తిస్తాయి.  
 
తిరుమల వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని ప్రతిరోజు దాదాపు 50 వేల మంది సందర్శిస్తుంటారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి టిక్కెట్ కొనుగోలు కోసం ఆన్‌లైన్ డిజిటల్ సేవలను అమలు చేసింది. 
 
డిసెంబర్ 23, 2022, తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో వార్షిక అధ్యాయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సుదీర్ఘ వార్షిక కార్యక్రమం వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు ప్రారంభమై జనవరి 15న ముగుస్తుంది.
 
ఈ సందర్భంగా 12 మంది ఆళ్వార్లు రచించిన నాలాయిర దివ్యప్రబంధ పాశురములు అని పిలువబడే మొత్తం 4000 కీర్తనలు ప్రతిరోజూ పఠించబడతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments