Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో వేడుకలు జనవరి 1 నుంచి 11 వరకు..

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (18:15 IST)
వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సదుపాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. వైకుంఠ ఏకాదశి పుణ్యకాలం దగ్గరలోనే ఉంది. వైకుంఠ ఏకాదశి వేడుకలు పది రోజుల పాటు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 2 జనవరి 2023 నుండి 11 జనవరి 2023 వరకు నిర్వహించబడుతుంది.
 
దాదాపు రూ.300 ధర ఉండే ప్రత్యేక దర్శనం టిక్కెట్లు డిసెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచబడ్డాయి. ఈ టిక్కెట్‌లు, ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత జనవరి 1 నుండి 11 వరకు వర్తిస్తాయి.  
 
తిరుమల వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని ప్రతిరోజు దాదాపు 50 వేల మంది సందర్శిస్తుంటారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి టిక్కెట్ కొనుగోలు కోసం ఆన్‌లైన్ డిజిటల్ సేవలను అమలు చేసింది. 
 
డిసెంబర్ 23, 2022, తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో వార్షిక అధ్యాయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సుదీర్ఘ వార్షిక కార్యక్రమం వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు ప్రారంభమై జనవరి 15న ముగుస్తుంది.
 
ఈ సందర్భంగా 12 మంది ఆళ్వార్లు రచించిన నాలాయిర దివ్యప్రబంధ పాశురములు అని పిలువబడే మొత్తం 4000 కీర్తనలు ప్రతిరోజూ పఠించబడతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

తర్వాతి కథనం
Show comments