Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప నూనెతో దీపాలను వెలిగిస్తే.. లాభాలేంటో తెలుసా? (video)

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:11 IST)
దీపారాధనతో అజ్ఞానాన్ని పారద్రోలవచ్చు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. సంపద, ఆరోగ్యం ప్రాప్తించాలంటే దీపారాధన చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. పాపాలను తొలగించుకోవడం కోసం పుణ్యఫలాలను పొందాలంటే దీపారాధన చేయాలి. అయితే దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. 
 
దీపారాధనకు నెయ్యిని ఉపయోగించడం శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో నేతితో దీపం వెలిగించడం ద్వారా సానుకూల ఫలితాలు వుంటాయి. నేతితో దీపాలను వెలిగించడం ద్వారా ఆ ఇంట దారిద్ర్యం తొలగిపోతుంది. ఆరోగ్యం, సంపద చేకూరుతుంది. ఇంకా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఈతిబాధలు తొలగిపోతాయి.
 
నువ్వుల నూనె.. 
నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే.. నవగ్రహ దోషాలుండవు. దుష్ట శక్తుల ప్రభావం అస్సలు వుండదు. పుర్వ జన్మల కర్మ ఫలితాలతో కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. శనీశ్వర గ్రహ ప్రభావంతో ఏర్పడే ఇబ్బందులను తొలగించుకోవాలంటే.. శనివారం పూట నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ముఖ్యం శనిగ్రహ దోషాలను ఈ నూనె దూరం చేస్తుంది.
 
వేపనూనె
వేప నూనెతో దీపాలను వెలిగిస్తే.. పార్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. కులదేవతా పూజకు తప్పకుండా వేపనూనెను వాడాలట. అలా వాడితే సంపద, ఆయుర్దాయం చేకూరుతుంది. శత్రుబాధలు వుండవు. ఇంకా కాలభైరవునికి వేపనూనెతో పౌర్ణమి రోజు, కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి రోజు 8 ప్రమిదలతో దీపమెలిగిస్తే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కర్మ ఫలితాలు వుండవు. 
 
ఆముదంతో దీపాలు వెలిగిస్తే.. సుఖసంతోషాలతో కూడిన జీవనం చేకూరుతుంది. వ్యాపారాభివృద్ధి, కీర్తి లభిస్తుంది. అలాగే విఘ్నేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. కొబ్బరినూనెతో దీపమెలిగించాలి. అలాగే వినాయకుడికి కొబ్బరినూనెతో దీపమెలిగించే వారి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. 
 
పంచ దీప నూనె.. 
పంచ దీప నూనెతో శివానుగ్రహం లభిస్తుంది. ఈ నూనెతో శివలింగం ముందు దీపమెలిగిస్తే.. ఆరోగ్యం, ఆయుర్దాయం చేకూరుతుంది. ప్రతికూల ఫలితాలుండవు. పంచ దీప నూనెతో దీపమెలిగించే ఇంట సానుకూల ఫలితాలే వుంటాయి. అప్పుల బాధ వుండదు. 
 
కాలభైరవునికి పంచ దీప నూనెతో పౌర్ణమి రోజుల్లో వెలిగిస్తే.. ఆర్థిక ఇబ్బందులుండవని.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలనుకునే వారు పంచ దీప నూనెతో కృష్ణ పక్ష అష్టమి రోజున కాలభైరవునికి దీపమెలిగించి.. పరమేశ్వరునికి విభూతితో అభిషేకం చేయించాలని పండితులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

క్లాస్‌ రూంలో ప్రొఫెసర్ డ్యాన్స్ - చప్పట్లు - ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు!!

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

ఒకరితో పెళ్లి - ఇంకొకరితో ప్రేమ - కాన్ఫరెన్స్ కాల్‌లో దొరికేశాడు...

అన్నీ చూడండి

లేటెస్ట్

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments