Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవుకు అవిసె ఆకు, పండ్లను ఎందుకు ఇవ్వాలో తెలుసా?

ఆవుకు అవిసె ఆకు, పండ్లను ఇవ్వడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆవును పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. కామధేనువును పూజించడం ద్వారా పూర్వీకులు చేసిన పాప

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (14:28 IST)
ఆవుకు అవిసె ఆకు, పండ్లను ఇవ్వడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆవును పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. కామధేనువును పూజించడం ద్వారా పూర్వీకులు చేసిన పాపాలు, శాపాలు తీరుతాయి. పితృదేవతల ఆశీర్వాదం దక్కుతుంది. కుటుంబీకుల మధ్య ఐక్యత చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి.
 
ముందుగా తెలియక చేసిన పాపాలను తొలగించుకోవాలంటే కామధేనువును పూజించాలి. చోరీలు, అవినీతికి పాల్పడటంతో ఏర్పడే దోషాలుతొలగిపోవాలన్నా కామధేనువును పూజించాల్సిందే. చాలాకాలం పాటు పితృదేవతలకు తిథి, కర్మకార్యాలు చేయని ఇంటివారు కామధేనువును పూజించడం ద్వారా ఆ పాపం తొలగిపోతుంది. 
 
పితృదేవతలను పూజించని వారు, వారికి తిథికి అన్నం పెట్టని వారు పాపాత్ముల కిందకు వస్తారని.. అలాంటివారు అవిసె ఆకును ఆవును ఇవ్వడం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గోశాల పక్కన లేకుంటే గోవు వుండే ప్రాంతంలో కూర్చుని మంత్ర జపం చేయడం, ధర్మకార్యాలు చేయడం ద్వారా పలు రెట్లు శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments