పళ్లాలమ్మ తల్లి ఆవిర్భవించిన కథ....

గోదావరి జిల్లాల్లో పళ్లాలమ్మ తల్లి క్షేత్రం గురించి తెలియని వారుండరు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపోట మండలం వానపల్లిలో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారని, అందువలనే వానరపల్లిగా ప

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (13:14 IST)
గోదావరి జిల్లాల్లో పళ్లాలమ్మ తల్లి క్షేత్రం గురించి తెలియని వారుండరు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపోట మండలం వానపల్లిలో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారని, అందువలనే వానరపల్లిగా పిలవబడేదని శాస్త్రంలో చెప్పబడుతోంది. కాలక్రమంలో ఆ పేరు కాస్త వానపల్లిగా మారిపోయిందని అంటుంటారు.
 
సీతారాములు ఈ ప్రాంతానికి వచ్చారనీ సీతమ్మ తల్లి వలనే పళ్లాలమ్మ తల్లి ఇక్కడకి ఆవిర్భవించిందని పురాణంలో చెప్పబడింది. ఈ ప్రదేశానికి వచ్చిన సీతమ్మ తల్లి ప్రకృతి మాతను పూజించిందట. ఆ తల్లి సీతమ్మ కోసం పువ్వులతో, పండ్లతో ప్రత్యక్షమైయ్యారు. సీతమ్మ తల్లి ఎదుట ప్రకృతి మాతగా ప్రత్యక్షమై పువ్వులను, పండ్లను అందించిన అమ్మవారే పళ్లాలమ్మగా ఇక్కడ అవిర్భవించారు.
 
అప్పటి నుండి అమ్మవారు భక్తులచే పూజలు, అభిషేకాలు అందుకుంటున్నారు. భక్తులు ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తున్నారు. ఈ పాంత్రంలోని చాలామంది ఈ అమ్మవారిని తమ ఇష్టమైన దైవంగా భావించి ఆరాధిస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.     

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

మంచు తుఫానులో చిక్కుకున్న అమెరికా

అన్నీ చూడండి

లేటెస్ట్

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

తర్వాతి కథనం
Show comments