Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రహదోషాలు తొలగిపోవడానికి నవగ్రహాలను పూజిస్తే...

నవగ్రహాలు భూమిపై నివసించే మానవాళి మనుగడపై ప్రభావం చూపుతుంటాయి. ఆయా గ్రహాల అనుగ్రహం లేకపోతే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గ్రహ సంబంధమైన దోషాల కారణంగా ఆర్ధిక పరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు సతమతం

గ్రహదోషాలు తొలగిపోవడానికి నవగ్రహాలను పూజిస్తే...
, శనివారం, 28 జులై 2018 (11:40 IST)
నవగ్రహాలు భూమిపై నివసించే మానవాళి మనుగడపై ప్రభావం చూపుతుంటాయి. ఆయా గ్రహాల అనుగ్రహం లేకపోతే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గ్రహ సంబంధమైన దోషాల కారణంగా ఆర్ధిక పరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు సతమతం చేస్తుంటాయి. అంతేకాకుండా వివాహంలో ఆలస్యం, సంతానం లేమి వంటి సమస్యలు బాధిస్తుంటాయి. తలపెట్టిన కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోతుంటాయి.
 
అందువలన చాలామంది నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తుంటారు. అలానే అభిషేకాలు జరుపుతుంటారు. గ్రహ శాంతులు చేయిస్తుంటారు. ఇలాంటి గ్రహదోషాల నుండి విముక్తి కలిగించే మార్గాలలో ఒకటిగా నవగ్రహ చాలీసా అని ఆధ్యాత్మిక గ్రంధాల్లో చెప్పబడుతోంది. అనునిత్యం నవగ్రహాల చుట్టూ తొమ్మిది దీపాలు వెలిగించి నవగ్రహాలకు నమస్కరిస్తూ నవగ్రహ చాలీనా ను పఠించవలసి ఉంటుంది. 
 
ఇలా చేయడం వలన గ్రహదోషాలు సంబంధమైన దోషాలు తొలగిపోయి ఆశించిన ఫలితాలు కనిపిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. నవగ్రహాలకు ప్రదక్షణలు, పూజలు, దీపారాధనలు చేయడం వలన మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిలిచిపోకుండా సంతోషంగా జరిగిపోతాయి. జీవితంలో ఎటువంటి ఆటంకాలను ఎదుర్కోవలసి ఉండదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం నాడు ఉపవాస ప్రార్థన చేస్తే... శనీశ్వరుని అనుగ్రహం...