ఆషాఢ అమావాస్య.. పితృదేవతలకు తర్పణాలిస్తే.. ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా?

Webdunia
శనివారం, 18 జులై 2020 (17:52 IST)
అమావాస్య రోజుల్లో పుణ్యతీర్థాల్లో స్నానమాచరించే వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే పితృదేవతలకు తర్పణం వదలడం, పితృపూజలు చేయడం వంటివి మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఆషాఢంలో వచ్చే అమావాస్య రోజున గంగానదిలో స్నానమాచరించి.. పితృ తర్పణాలు వదలడం శుభఫలితాలనిస్తుంది. 
 
ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున మూడు సముద్రాలు కలిసే చోట కన్యాకుమారి, ధనుష్కోటి, రామేశ్వరం అగ్ని తీర్థంలో స్నానమాచరిస్తే.. పితృదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. వేదారణ్యం, గోకర్ణం వంటి ప్రాంతాల్లో అమావాస్య రోజున స్నానమాచరించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలా కాకుంటే సముద్ర స్నానమైనా చేయాలి. అలాగే ఆషాఢ అమావాస్య రోజున ఇంట పూజలు చేస్తే పితరుల ఆశీర్వాదం లభిస్తుంది. 
 
దక్షిణాయనంలో వచ్చే అమావాస్య కావడంతో పుణ్యతీర్థాల్లో పితృ పూజలు చేయడం.. బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం వంటివి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. చాతుర్మాస దీక్షలుండే వారు ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగించుకోవచ్చునని విశ్వాసం. అలాగే ఆషాఢ అమావాస్య పూజతో ఇంట వుండే దుష్టశక్తులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వున్న ఇమ్మడి రవి పేరు.. టికెట్ రేట్లు పెంచేస్తే?

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు : వైకాపా అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments