Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#WorldPopulationDay2020 ఎప్పుడు? భారత్-చైనా దేశాలు ఆ పని చేయకపోతే.. గోవిందా..?!

#WorldPopulationDay2020 ఎప్పుడు? భారత్-చైనా దేశాలు ఆ పని చేయకపోతే.. గోవిందా..?!
, శుక్రవారం, 10 జులై 2020 (11:34 IST)
World Population Day 2020
సాధారణంగా ఏదైనా చాలా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు, జనాభాకు సంబంధించి మన గ్రహం భూమికి కూడా ఇది వర్తిస్తుంది. జనాభాను ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న ఒకే జాతికి చెందిన జీవుల సంఖ్య, సంతానోత్పత్తి సామర్ధ్యంతో నిర్వచించబడింది. ఈ సందర్భంలో మనం ఒక నగరం లేదా పట్టణం, ప్రాంతం, దేశం లేదా ప్రపంచంలో నివసించే మానవుల సంఖ్య గురించి మాట్లాడుతున్నాం. 
 
ప్రస్తుతం జనాభా గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే..? జూలై 11, ప్రపంచ జనాభా దినోత్సవం 2020గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రపంచ జనాభా దినోత్సవ ఉనికిని గురించి తెలుసుకుందాం.. నివేదికల ప్రకారం, మార్చి 2020 నాటికి భూమిపై 7.8 బిలియన్ల మంది నివసిస్తున్నారని తెలిసింది. 
 
ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారితో, ప్రణాళిక లేని గర్భాల కారణంగా ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా. జనాభా పరిమాణం విభిన్న ప్రాంతాలలో విభిన్న రేట్ల వద్ద హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇంకా ఆసియా అత్యధిక జనాభా కలిగిన ఖండం, చైనా, భారతదేశం కలిసి ప్రపంచ జనాభాలో 36 శాతం ఉన్నాయి. ఇంత భారీ జనాభాతో, సమస్యలు తలెత్తుతున్నాయి.
 
ప్రపంచ జనాభా దినోత్సవం చరిత్ర:
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమానికి చెందిన పాలక మండలి దీనిని 1989లో జరుపుకోవాలని నిర్ణయించింది. జూలై 11, 1987న ఐదు బిలియన్ల దినోత్సవంలో ప్రజా ఆసక్తితో ఇది ప్రేరణ పొందింది. ప్రపంచ జనాభా ఐదు బిలియన్ల మందికి చేరిన సుమారు తేదీ కూడా ఇదే. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 1990 డిసెంబర్ 45/216 తీర్మానం ద్వారా రోజును కొనసాగించాలని నిర్ణయించింది.
 
ప్రపంచ జనాభా దినోత్సవం ప్రాముఖ్యత:
ఈ రోజు ప్రపంచ దేశాలకు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇది అధిక జనాభా సమస్యలను హైలైట్ చేస్తుంది. పర్యావరణం, అభివృద్ధిపై అధిక జనాభా ప్రభావాల గురించి అవగాహన పెంచుతుంది. గర్భస్థ మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కుల ప్రాముఖ్యత గురించి ఈ రోజు ఎత్తిచూపుతుంది.
 
ప్రపంచ జనాభా దినోత్సవం 2020 థీమ్ సంగతికి వస్తే?
COVID-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల ఆరోగ్యం, అలాగే హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోవాలని ఐరాస సూచించింది. 
 
లాక్డౌన్ 6 నెలలు కొనసాగితే, ఆరోగ్య సేవలకు పెద్ద అంతరాయం ఏర్పడితే, తక్కువ మధ్య-ఆదాయ దేశాలలో 47 మిలియన్ల మంది మహిళలు ఆధునిక గర్భనిరోధక మందులను పొందలేరని ఇటీవలి యుఎన్‌ఎఫ్‌పిఎ పరిశోధన హైలైట్ చేసింది. 
 
ఇది 7 మిలియన్ల అనాలోచిత గర్భాలకు దారితీస్తుంది. ఇదే జరిగితే హింస, మహిళలకు అనారోగ్య సమస్యలు, బాల్య వివాహాలు పెరగే ప్రమాదం వుందని ఐరాస హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ప్రతి దేశం జనాభా నియంత్రణకు నడుం బిగించాలని ఐరాస పిలుపునిస్తోంది. అంతేగాకుండా భారత్, చైనా దేశాలు జనాభా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సియోల్ మేయర్ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?