కార్తీక మాసంలో శివునికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే?

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (16:37 IST)
కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయించిన వారికి ఐశ్వర్యాలు, వంశాభివృద్ధి చేకూరుతుంది. కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరం. ఈ మాసంలో తులసీ పూజ చేయడం.. తులసీ మాల ధరించడం, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈ మాసంలో చేసే పూజలతో శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు సంతృప్తి చెందుతారని విశ్వాసం. 
 
శ్రీ మహా విష్ణువు అలంకార ప్రియుడైతే.. శివుడు అభిషేక ప్రియుడనే విషయం తెలిసిందే. అలాంటి శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు వుంటాయని పండితులు అంటున్నారు. అందుకే పాలతో కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి. పెరుగుతో అభిషేకిస్తే.. ఆరోగ్యం, ఆయుష్షు చేకూరుతుంది. 
 
నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా సంతానం, తేనెతో అభిషేకం చేయడం వలన తేజస్సు లభిస్తాయి. కొబ్బరినీళ్లతో అభిషేకం చేయడం ద్వారా సంపదలు చేకూరుతాయి. మామిడి రసంతో శివునికి అభిషేకం చేస్తే ధనధాన్యాలు సమకూరుతాయి. నేరేడు పండు రసంతో శివునికి అభిషేకం చేయిస్తే.. ఉద్యోగ ప్రాప్తి, విజయాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అమరావతిలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్.. నారా లోకేష్‌ ప్రధాన ప్రాజెక్ట్ ఇదే

అన్నీ చూడండి

లేటెస్ట్

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

పంచమి రోజున వారాహి పూజ... ఏ రాశుల వారు ఆమెను పూజించాలి.. తెలుపు బీన్స్?

2026 పూరీ జగన్నాథుని రథయాత్రతో ప్రారంభం.. సేంద్రియ బియ్యంతో మహా ప్రసాదం

24-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. విలాసాలకు వ్యయం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments